← Back to news

ఎక్కువమంది పిల్లల్ని కనాలా..వద్దా?: అరవింద్ కేజ్రీవాల్

By విశీ· 29 Jul 2026
ఎక్కువమంది పిల్లల్ని కనాలా..వద్దా?: అరవింద్ కేజ్రీవాల్

బీజేపీ విధానాలపై దిల్లీ మాజీ మంత్రి అరవింద్ కేజ్రీవాల్ సెటైర్ వేశారు. RSS అధ్యక్షుడు మోహన్ భాగవత్ ఎక్కువ మంది పిల్లల్ని కనమంటున్నారని.. దిల్లీ సీఎం రేఖా గుప్తా మాత్రం ప్రభుత్వం ప్రారంభించిన దిల్లీ లక్ష్మీ యోజనలో ముగ్గురు కంటే ఎక్కువమంది పిల్లలుంటే అనర్హులుగా ప్రకటిస్తున్నారని అన్నారు. ఈ విధానాలతో దిల్లీ ప్రజలు అయోమయంలో పడ్డారని కేజ్రీవాల్ తన ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. మోహన్ భాగవత్, రేఖా గుప్తా కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ఏం చేయాలో చెప్పాలన్నారు.

More in India