ఆరు తరాలు కలిసి.. ఆదర్శంగా నిలిచి

AP: మనుషుల మధ్య దూరం పెరుగుతున్న నేటి డిజిటల్ యుగంలో కుటుంబం అంతా కలిసి ఉండడం అంత ఈజీ కాదు. కానీ, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లి గ్రామంలో హనుమంత రాయుడు, ముత్యాలప్పల రెండు కుటుంబాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. రెండు కుటుంబాలతో మొదలైన వీరి ప్రస్థానం నేడు ఆరుతరాలకు విస్తరించి ఏకంగా 83మంది సభ్యులతో ఒకే ఇంట్లో ఉంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కుటుంబ పెద్దలైన హనుమంత రాయుడు, ముత్యాలప్ప రోజువారీ పనులను పర్యవేక్షిస్తారు. వ్యవసాయం నుంచి వ్యాపారాల వరకు ప్రతిదీ సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటారు.



