← Back to news

రాజ్యాంగంపై కుట్ర జరుగుతోంది: చాడ

By dk· 9 Aug 2026· కరీంనగర్ జిల్లా
రాజ్యాంగంపై కుట్ర జరుగుతోంది: చాడ

TG: ప్రధాని మోదీ పాలనలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం నిర్వీర్యమయ్యాయని CPI సీనియర్ నేత చాడ వెంకటరెడ్డి విమర్శించారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో CPI ప్రచార బస్సు యాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ప్రచార, పాదయాత్రలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మోదీ ఇచ్చిన ఉద్యోగాలు, నల్లధనం వెనక్కి తీసుకురావడం వంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. నిత్యావసర ధరల పెరుగుదల, పేపర్ లీకేజీలతో ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

More in TG