← Back to news

‘మీ కాళ్లు మొక్కుతా..,భూముల జోలికి రాకండి’

By VISHI· 9 Jun 2026

TG: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. చింతలమానేపల్లి మండలం దిందాలో రైతులు సాగు చేసుకుంటున్న పోడు భూములను చదును చేసేందుకు అటవీ శాఖ అధికారులు వచ్చారు. తమ భూమి లాక్కోవద్దని, సాగు నాశనం చేయొద్దని రైతులు అధికారులను అడ్డుకున్నారు. రైతులను అదుపులోకి తీసుకుని అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు.

More in TG