← Back to news

పుష్కరాల పనులు త్వరగా పూర్తిచేయండి: పవన్ కళ్యాణ్

By Mahesh· 21 Jul 2026· AP
పుష్కరాల పనులు త్వరగా పూర్తిచేయండి: పవన్ కళ్యాణ్

AP: ‘స్వచ్ఛ గోదావరి–పవిత్ర పుష్కరాలు’ అనే థీమ్‌తో గోదావరి పుష్కరాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలోని మునికూడలిని మోడల్ పుష్కర్ పంచాయతీగా తీర్చిదిద్దుతున్నారు. ఇందుకోసం రూ.7 కోట్ల వ్యయంతో పనులు చేపట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యవేక్షణలో ఈ పనులు కొనసాగుతున్నాయి. మునికూడలి మోడల్ నమూనాతో మిగిలిన పుష్కర పంచాయతీల పనులను పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశించారు.

More in AP