IASలపై ఈటల కీలక కామెంట్స్.. CM డైరెక్షన్లోనే దందా?

TG: రాష్ట్రంలో కొందరు IAS అధికారులపై BJP ఎంపీ ఈటల రాజేందర్ కీలక ఆరోపణలు చేశారు. CM రేవంత్రెడ్డి డైరెక్షన్లో కొందరు అధికారులు కావాలనే భూములను బ్యాన్డ్ లిస్ట్లో పెడుతున్నారని ఆరోపించారు. CM లేదా ఆయనకు సంబంధించిన వారి నుంచి క్లారిఫికేషన్ వచ్చిన తర్వాతే వాటిని క్లియర్ చేస్తున్నారని అన్నారు. భూముల వాల్యూ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ దందా సాగుతోందని, బాధితుల నుంచి డబ్బులు వసూలు చేయడమే టార్గెట్ అని ఆరోపించారు. బాధితులు కలెక్టర్, సబ్రిజిస్ట్రార్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని పేర్కొన్నారు.



