విశాఖ తీరంలో టెన్షన్.. ఆ ఏడుగురి జాడే లేదు

AP: విశాఖ తీరంలో వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారడంతో వీరు ప్రమాదంలో చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. వీరు జూలై 1న విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి బోటులో సముద్రంలోకి వేటకు వెళ్లారు. సముద్రం ఒక్కసారిగా మారడంతో తిరిగి హార్బర్కు వచ్చేందుకు నిర్ణయించుకున్నారు. నిన్న మత్స్యకారులు తమ కుటుంబసభ్యులకు ఫోన్ చేసి, మధ్యాహ్నం 3గంటల కల్లా విశాఖ ఫిషింగ్ హార్బర్కు చేరుకుంటామని చెప్పారు. ఇంకా రాకపోవడంతో ఆందోళన మొదలైంది.



