← Back to news

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై

By DS· 23 Jun 2026· Hyderabad
లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై

హైదరాబాద్ లో మరో పోలీస్ అధికారి అవినీతికి పాల్పడుతూ ఏసీబీకీ దొరికిపోయాడు..! సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ లో ఎస్సై అధికారిగా విధులు నిర్వహిస్తున్న నరసింహ అవినీతికి పాల్పడ్డాడు..! ఒక కేసులో నిందితుడికి బెయిల్ ఒప్పించడానికి లక్ష రూపాయలు డిమాండ్ చేశాడు..! అయితే అంత ఇచ్చుకోలేనని కాస్త తగ్గించాలని కోరినప్పటికీ నరసింహ ససేమిరా అన్నాడు..! దీంతో ముందుగా రూ. యాబై వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది..! అప్పటికే అతన్ని ఏసీబీకి పట్టించాలని డిసైడ్ అయిన నిందితుడి తరపువాళ్ళు ముందస్తు సమాచారంతో పక్కాగా ట్రాప్ చేసి పట్టుకున్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 23h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.