తండ్రి లేని ఆడపిల్లలకు అండగా నిలిచిన కలెక్టర్

AP: అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం కే.జగన్నాథపురం విలేజ్కు చెందిన పిచ్చిక సత్యనారాయణ ఇటీవల పక్షవాతంతో బాధపడుతూ అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన భార్య పూర్తిగా మానసిక దివ్యాంగురాలు. వారికి ముగ్గురు కూతుర్లు ఉన్నారు. తండ్రి మరణంతో ఆడ బిడ్డల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. తల్లికి దివ్యాంగ పెన్షన్ రూ.15వేలు ఇప్పించాలని, ప్రభుత్వ పరంగా ఆర్థికసాయం చేయాలని వారు జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ను కోరారు. వెంటనే స్పందించిన కలెక్టర్ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.



