← Back to news

మాజీ మంత్రిపై కేసు నమోదు

By DK· 16 Jul 2026
మాజీ మంత్రిపై కేసు నమోదు

AP: కాకినాడ జిల్లా కిర్లంపూడిలో నిన్న ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. ముద్రగడ కుటుంబ సభ్యులు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడాన్ని తిరస్కరించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకుంది. అంత్యక్రియల సమయంలో గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహించే క్రమంలో అంబటి రాంబాబు, YCP నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళన చేశారు. తమ విధులకు ఆటకం కలిగించారని, తమను నెట్టివేశారని పోలీసులు ఫిర్యాదు చేయడంతో FIR నమోదైంది.

More in AP