శుభకార్యానికి వెళ్తుండగా ఘోర విషాదం

AP: విశాఖపట్నం జిల్లాలోని ఆనందపురం-అనకాపల్లి నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గండిగుండం సమీపంలో కారు అదుపుతప్పి ముందువెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాదంలో డ్రైవర్తో సహా నలుగురు స్పాట్లోనే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పల్నాడు జిల్లా వినుకొండ నుంచి శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో శుభకార్యానికి వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



