హైడ్రా కమిషనర్పై హైకోర్టు సీరియస్

TG: హైడ్రా కమిషనర్ AV రంగనాథ్పై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రైవేట్ భూమిలోకి వెళ్లరాదన్న కోర్టు ఆదేశాలను మూడుసార్లు ఉల్లంఘించినందుకు అరెస్టు చేయాలని కూడా ఆదేశించింది. అయితే ప్రభుత్వ న్యాయవాదుల విజ్ఞప్తితో ఆ ఆదేశాలను విరమించుకుని, ఆయన వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. మల్కాజ్గిరి మండలం లోతుకుంట భూమి వివాదంలో హైడ్రా జోక్యంపై విచారణ జరిపిన ధర్మాసనం, కోర్టు ధిక్కరణను తీవ్రంగా పరిగణించింది. హైడ్రా ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని, కోర్టు ఆదేశాలంటే లెక్క లేకుండా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయింది.



