← Back to news

రూ.20 కోసం తల నరికేశాడు

By Mahesh· 18 Jul 2026· TG
రూ.20 కోసం తల నరికేశాడు

TG: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ రోడ్ రైల్వేస్టేషన్ దగ్గర నిన్న దారుణం జరిగింది. పర్సనంబాల గ్రామానికి చెందిన సోమయ్య(65) అనే వృద్దుడిని తుంగెడ గ్రామానికి చెందిన నగేష్ దారుణంగా హత్య చేశాడు. రైల్వే స్టేషన్ దగ్గర నగేష్, సోమయ్య దగ్గరకొచ్చి టీ కోసం రూ.20 అడిగాడు. డబ్బులు లేవని సోమయ్య చెప్పి ముందుకు వెళ్లిపోయాడు. నగేష్ అతణ్ని వెంబడించి గొడ్డలితో తల నరికి పారిపోయాడు. పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని ఆసిఫాబాద్ హాస్పిటల్‌కు తరలించారు. నగేష్ కోసం పోలీసులు వెతుకున్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 17h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.