రూ.20 కోసం తల నరికేశాడు

TG: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ రోడ్ రైల్వేస్టేషన్ దగ్గర నిన్న దారుణం జరిగింది. పర్సనంబాల గ్రామానికి చెందిన సోమయ్య(65) అనే వృద్దుడిని తుంగెడ గ్రామానికి చెందిన నగేష్ దారుణంగా హత్య చేశాడు. రైల్వే స్టేషన్ దగ్గర నగేష్, సోమయ్య దగ్గరకొచ్చి టీ కోసం రూ.20 అడిగాడు. డబ్బులు లేవని సోమయ్య చెప్పి ముందుకు వెళ్లిపోయాడు. నగేష్ అతణ్ని వెంబడించి గొడ్డలితో తల నరికి పారిపోయాడు. పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని ఆసిఫాబాద్ హాస్పిటల్కు తరలించారు. నగేష్ కోసం పోలీసులు వెతుకున్నారు.



