← Back to news

ACBకి చిక్కిన అధికారులు.. బాణసంచా కాల్చి సంబరాలు

By DK· 13 Jun 2026· Andhrajyothy· మహబూబాబాద్ జిల్లా
ACBకి చిక్కిన అధికారులు.. బాణసంచా కాల్చి సంబరాలు

TG: లంచాలకు అలవాటుపడిన ఇద్దరు అధికారులు, వారికి సహకరించిన ఓ అధికారిణి కుమారుడు ACB వలకు చిక్కారు. హైదరాబాద్‌కు చెందిన ఓ వెంచర్‌ యజమాని నుంచి రూ.45వేలు లంచం తీసుకుంటూ మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండల MPDO పెనుగొండ రాధిక, MPO కిన్నెర యాకయ్యతోపాటు ఎంపీడీవో రాధిక కుమారుడు నాగార్జున ACBకి రెడ్‌ హ్యాండెడ్‌ దొరికారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వరంగల్‌ ఏసీబీ DSP సాంబయ్య తెలిపారు. అధికారుల అరెస్టుతో నర్సింహులపేట మండల ప్రజలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.