← Back to news

అత్తమామల స్కెచ్‌కి ప్రేమ జంట బలి!

By sahani· 30 Jun 2026· Telangana
అత్తమామల స్కెచ్‌కి ప్రేమ జంట బలి!

రంగారెడ్డి జిల్లా జనవాడలో ఘోరం జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న బాలసాయి, పద్మ దంపతులు అత్తమామల మోసానికి బలయ్యారు. ఇంట్లో గుప్తనిధులు ఉన్నాయంటూ నమ్మించిన అత్తమామలు, పూజల కోసం బాలసాయి చేత ₹10 లక్షలు అప్పు చేయించారు. తీరా తవ్వితే ఏమీ దొరకలేదు. అప్పు ఇచ్చిన వారి ప్రెషర్ తట్టుకోలేక, మోసపోయామని గ్రహించిన ఈ జంట ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నారు. ఐదు నెలల చిన్నారి అనాథగా మిగిలింది. బాలసాయి ఫోన్ మెసేజ్ ఆధారంగా పోలీసులు అత్తమామలను, బావను అరెస్ట్ చేశారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 20h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.