← Back to news

తెల్లవారుజామున షాకింగ్‌ యాక్సిడెంట్‌

By dk· 14 Aug 2026· మహబూబ్‌నగర్ జిల్లా
తెల్లవారుజామున షాకింగ్‌ యాక్సిడెంట్‌

TG: హైదరాబాద్‌ నుంచి తమిళనాడులోని అరుణాచలానికి ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్‌ బస్సు మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ సమీపంలో నేషనల్ హైవేపై అదుపుతప్పి బోల్తా పడింది. ప్రయాణికులు నిద్రలో ఉండటంతో కేకలు, ఆర్తనాదాలతో భయానక పరిస్థితి నెలకొంది. స్థానికులు, హైవే పెట్రోలింగ్‌ సిబ్బంది వెంటనే బస్సు అద్దాలు పగులగొట్టి ప్రయాణికులను బయటకు తీశారు. గాయపడిన 21 మందిని 108 అంబులెన్సుల్లో మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్‌ నిద్రమత్తులోకి జారుకోవడం, అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.

More in TG