NOC కోసం లంచం డిమాండ్.. చివరికీ

TG: ఆదిలాబాద్ పట్టణంలోని నీటి పారుదల శాఖ కార్యాలయంలో లంచం తీసుకుంటున్న ఇద్దరు అధికారులను ACB అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. సొనాల ప్రాంతానికి చెందిన చౌహన్ విక్రమ్ సింగ్ పౌల్ట్రీఫామ్ ఏర్పాటు కోసం NOC కావాలని దరఖాస్తు చేసుకున్నాడు. నీరుపారుదల EE రాథోడ్ విఠల్, AE రమేష్ రూ. 1 లక్ష లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫైనల్గా రూ.60 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. బాధితుడు ఇంజనీర్లకు డబ్బులు ఇస్తుండగా ఇద్దరినీ పట్టుకున్నట్లు ఏసీబీ DSP మధు తెలిపారు.



