← Back to news

NOC కోసం లంచం డిమాండ్.. చివరికీ

By DK· 17 Jul 2026· ఆదిలాబాద్ జిల్లా
NOC కోసం లంచం డిమాండ్.. చివరికీ

TG: ఆదిలాబాద్‌ పట్టణంలోని నీటి పారుదల శాఖ కార్యాలయంలో లంచం తీసుకుంటున్న ఇద్దరు అధికారులను ACB అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సొనాల ప్రాంతానికి చెందిన చౌహన్‌ విక్రమ్‌ సింగ్‌ పౌల్ట్రీ‌ఫామ్‌ ఏర్పాటు కోసం NOC కావాలని దరఖాస్తు చేసుకున్నాడు. నీరుపారుదల EE రాథోడ్‌ విఠల్‌, AE రమేష్‌ రూ. 1 లక్ష లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఫైనల్‌గా రూ.60 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. బాధితుడు ఇంజనీర్లకు డబ్బులు ఇస్తుండగా ఇద్దరినీ పట్టుకున్నట్లు ఏసీబీ DSP మధు తెలిపారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 17h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.