ఆదివాసీల మనసు గెలిచిన కలెక్టర్

TG: ఆదిలాబాద్ గ్రామీణ మండలం పిప్పలేరి పంచాయతీ పరిధిలోని దహిగూడ గిరిజనులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనా, స్థలాల కొరత కారణంగా ఇళ్ల నిర్మాణం సాధ్యం కాలేదు. స్పందించిన కలెక్టర్ ప్రభుత్వ భూమిని కేటాయించి 17మంది లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. మౌలిక సదుపాయాలు త్వరగా కల్పించేలా చర్యలు చేపట్టారు. దీంతో కలెక్టర్పై గౌరవం, కృతజ్ఞతతో గ్రామస్థులు తమ గ్రామానికి రాజర్షిషా గూడగా పేరు పెట్టారు. కలెక్టర్ రాజర్షిషా తన పేరుతో ఏర్పాటు చేసిన గ్రామ బోర్డుకు ఆయన ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు.




