CEO అంటూ నిత్య పెళ్లికొడుకు డ్రామా !

AP: గుంటూరులోని పాండురంగానగర్కు చెందిన వక్కలగడ్డ సాంబశివరావుకు భార్య, పిల్లలున్నారు. గతంలో ఓ పత్రికలో పనిచేసిన సాంబశివరావు విలాసాలకు అలవాటుపడి మోసాల బాట పట్టాడు. పత్రికా యాజమాన్యం అతడిని ఉద్యోగం నుంచి తొలగించి కేసులు పెట్టింది. అయినా ఆయన అదే సంస్థకు CEOనని ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని మ్యాట్రిమోనీ వెబ్సైట్లలో తన వివరాలు పోస్టు చేసేవాడు. పలువురి మహిళల నుంచి రూ.2లక్షల నుంచి రూ.10లక్షల వరకు నగదు, బంగారు నగలు కాజేశాడు. బ్యాగులో ఎప్పుడూ పెళ్లి వస్త్రాలు, బాసికాలు సిద్ధంగా ఉంచుకునేవాడని పోలీసులు తెలిపారు. నిందితుణ్ణి అరెస్ట్ చేశారు.



