21ఏళ్లు నిండితే ఎన్నికల్లో పోటీ.. CM సంచలన ప్రకటన

TG: 21 ఏళ్లు నిండిన యువతకు MLA, MPగా పోటీ చేసే అవకాశం కల్పించేందుకు రాజ్యాంగ సవరణ కోరుతూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని CM రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడికి నిరసనగా శనివారం రాత్రి HYDలో నిర్వహించిన సంఘీభావ కొవ్వొత్తుల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఆగస్టు తొలి వారంలో అసెంబ్లీలో చర్చించి తీర్మానాన్ని కేంద్రానికి పంపనున్నట్లు తెలిపారు. 30 శాతం యువ జనాభాకు అవకాశం దక్కితే దేశ భవిష్యత్ మరింత బలోపేతమవుతుందని, కీలక శాఖల్లో యువత మంత్రులైతే ప్రపంచంతో పోటీ పడగలమన్నారు.



