విశాఖ తీరంలో టెన్షన... 48గంటలు గడిచినా ఆచూకీ లేదు

AP: విశాఖ తీరం నుంచి చేపల వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని విశాఖ రేంజ్ DIG గోపీనాథ్ జెట్టి తెలిపారు. మత్య్సకారులు 4వ తేదీ రాత్రి సమయంలో గల్లంతైన విషయం తెలిసిందే. 48గంటలు గడిచినా ఆచూకీ తెలియకపోవడంతో వారి కుటుంబసభ్యుల్లో ఆందోళన మొదలైంది. అదేరోజు కర్రి చిన్నా అనే మత్య్సకారుడిని చైనా షిప్ వాళ్లు సురక్షితంగా రక్షించారని చెప్పారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నామన్నారు. 4 షిప్పులు, 2 హెలికాప్టర్లతో రిస్య్కూ ఆపరేషన్ కొనసాగుతుందని DIG స్పష్టం చేశారు.



