నరసాపురంలో యువతి దారుణ హత్య

AP: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఓ యువతిని(31) మార్గాని రమేశ్ అనే వ్యక్తి అతి దారుణంగా హత్య చేశాడు. నరసాపురం రైల్వేస్టేషన్ నుంచి సఖినేటిపల్లికి కారులో వెళ్తున్న యువతిపై నిందితుడు కత్తితో పలుమార్లు పొడిచి చంపాడు. అడ్డుకోబోయిన కారు డ్రైవర్ సురేశ్పైనా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువతి డెడ్బాడీని స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు. గాయపడిన సురేశ్కి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



