టెక్ మహేంద్రా ఆఫీస్ ముందు టెకీ ధర్నా

TG: మేడ్చల్ జిల్లా దుండిగల్లోని టెక్ మహేంద్రా సాఫ్ట్వేర్ కంపెనీ ముందు భావన అనే ఉద్యోగిని నిరసనకు దిగింది. తన కుమార్తె అనారోగ్యంగా ఉండడంతో మూడు రోజుల సెలవు కోరగా, అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపించింది. ముందస్తుగా యాజమాన్యానికి మెసేజ్ పంపి అనుమతి కోరినప్పటికీ, ఉద్దేశపూర్వకంగానే తనను ఉద్యోగం నుంచి తీసేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ఆమె దుండిగల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కంపెనీ ముందు ధర్నా చేశారు.



