← Back to news

వరద ఉద్ధృతిలో వాగు దాటేందుకు యత్నం

By dk· 13 Aug 2026· రాజన్నసిరిసిల్ల జిల్లా

TG: రాజన్నసిరిసిల్ల జిల్లాలో వరద ఉద్ధృతి ప్రమాదకరంగా మారింది. ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండలాలను కలిపే పదిర–రామలక్ష్మణపల్లె మానేరు వాగు కాజ్‌వేపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండగా, కొందరు బైకర్లు వాగును దాటేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అదుపుతప్పిన రెండు బైక్‌లు ప్రవాహంలో పడిపోయాయి. స్థానికులు వెంటనే బైకర్లను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అనంతరం వాగులో పడిపోయిన రెండు బైకులను కూడా స్థానికుల సహాయంతో బయటకు తీశారు. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉంటే కాజ్‌వేలు దాటొద్దని అధికారులు సూచించారు.

More in TG