ఉప్పొంగిన వాగు.. రాకపోకలు బంద్
TG: కురిసిన భారీ వర్షాలతో యాదాద్రిభువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం వద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద నీరు బ్రిడ్జిపైకి చేరడంతో సంగెం–భువనగిరి మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితిని గమనించిన అధికారులు బ్రిడ్జి వద్ద భద్రతా చర్యలు చేపట్టి, ఎవరూ వరద నీటిలో ప్రయాణించవద్దని హెచ్చరించారు. వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని సూచించారు.



