నేడు జాతీయ జెండా రూపకర్త 'పింగళి వెంకయ్య' జయంతి

ఈరోజు ఇండియన్ ఫ్లాగ్ను డిజైన్ చేసిన పింగళి వెంకయ్య 150వ జయంతి. 1876 ఆగస్ట్ 2న కృష్ణా జిల్లా భట్లపెనుమర్రులో హనుమంత రాయుడు, వెంకటరత్నం దంపతులకు జన్మించారు. అయన ఒక వ్యవసాయ పరిశోధకుడు, విద్యావేత్త కూడా, మచిలీపట్నంలో ఒక విద్యాసంస్థను స్థాపించారు. దేశభక్తి, జాతీయ సమైక్యతకు ప్రతీకగా ఉన్న త్రివర్ణ పతాకం వెనుక ఆయన కృషి మరువలేనిది, తెలుగువారికీ గర్వకారణం. నేడు ఆయన సేవలను గుర్తుచేసుకుంటూ ముఖ్యనేతలు, ప్రముఖులు స్మరించుకుంటున్నారు.







