అనుమానంతో భార్యను కిరాతకంగా చంపిన భర్త

TG: భార్యపై అనుమానంతో భర్త రాడ్తో దాడిచేసి చంపాడు. మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన కోమలి (31), అవినాష్ దంపతులు ఆరునెలల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్కు వలస వచ్చారు. అత్తాపూర్ తేజస్వీనినగర్లోని ఓ అపార్ట్మెంట్లో కోమలి వాచ్మెన్గా చేస్తూ అదే భవనంలోని పలు ఇళ్లలో పనిమనిషిగా చేస్తోంది. భర్త అవినాష్ ఆటోడ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. ఆలస్యంగా ఇంటికొస్తోందనే అనుమానంతో అవినాష్ కత్తి, స్క్రూడ్రైవర్, రాడ్తో దాడిచేసి భార్యను నడిరోడ్డుపై చంపాడు.



