తుని చిన్నారి మిస్సింగ్ కేసుపై హైకోర్ట్ సీరియస్

AP: కాకినాడ జిల్లా తుని మండలం CH అగ్రహారానికి చెందిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసుపై హైకోర్ట్ సీరియస్ అయింది. పాప ఆచూకీ కనుగొనేందుకు తీసుకున్న చర్యల వివరాలు, ప్రస్తుత దర్యాప్తు పరిస్థితిపై సమగ్ర స్థాయి నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. మిస్సైన పిల్లల విషయంలో సుప్రీంకోర్టు నిర్దేశించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను పాటించారా లేదా తెలపాలని కోరింది. చిన్నారి ఆచూకీ కనుగొనడంలో పోలీసులు విఫలమయ్యారని లాయర్ శ్రీకాంత్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్ట్ ఈ ఆదేశాలను జారీ చేసింది.





