చితి మంటలు ఆరకముందే బూడిదను తవ్విన దుండగులు

TG: జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో అమానుష ఘటన వెలుగుచూసింది. ఓ మహిళ అంత్యక్రియలు ముగిసి కుటుంబసభ్యులు వెళ్లిన వెంటనే ఇద్దరు దుండగులు చితిపై నీళ్లు చల్లి మంటలను ఆర్పి బూడిదను సంచుల్లో నింపి తీసుకెళ్లారు. స్థానికులు గమనించి వెంటపడటంతో వారు బూడిదను వదిలేసి పరారయ్యారు. మహిళలు చనిపోతే ఆనవాయితీగా వారి మెడలో ధరించే నల్లపూసల ఆభరణం నుంచి ఓ బంగారు గుండు తీసి మృతురాలి నోట్లో పెట్టి చితికి నిప్పంటిస్తారు. సుమారు రూ.10వేల విలువైన బంగారు గుండు కోసం చితి బూడిదను తవ్వడం స్థానికులను కలచివేసింది.



