నల్లగండ్ల రేణుకా ఎల్లమ్మ ఆలయంలో బోనాల వేడుకలు

TG: శేరిలింగంపల్లిలోని నల్లగండ్ల నేతాజీనగర్ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో బోనాల పండుగ ఘనంగా జరిగింది. టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.జగదీశ్వర్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నియోజకవర్గ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రఘునందన్రెడ్డి, మల్లికార్జున్ యాదవ్ పాల్గొన్నారు.



