అదుపుతప్పి బావిలో పడ్డ కారు... మహిళ మృతి

కారు అదుపుతప్పి నీరు లేని వ్యవసాయ బావిలో పడి మహిళ మృతి చెందిన ఘటన భీమదేవరపల్లి మండలం మంగళపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది.. వివరాల మేరకు సైదాపూర్ మండలం, బొమ్మకల్ గ్రామానికి చెందిన రవీందర్ రెడ్డి, కిరణ్, ఏలూరి రాధ, వీరారెడ్డి కలిసి పోతారంలోని శుభం గార్డెన్లో పెళ్లికి వెళ్లి వస్తుండగా, మంగళపల్లి శివారులోని తోట దగ్గర రోడ్ పక్కన ఉన్న బావిలో కారు అదుపుతప్పి పడింది.. రాధ అక్కడే మృతి చెందగా, మిగతా వారికి గాయాలయ్యాయి... పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

