పోలీసుల నుంచి రక్షణ కావాలి-మహ్మద్ జునైద్

దిల్లీ జంతర్ మంతర్లో విద్యార్థుల ఆకలి తీర్చిన మహ్మద్ జునైద్ మాలిక్ పోలీసుల నుంచి తనకూ, తన కుటుంబానికీ రక్షణ కావాలని సుప్రీం కోర్టుకెక్కారు. నిరసనకారులకు ఆహారం పెడుతున్న తనను పోలీసులు నిర్భందించి బెదిరించారని పిటిషన్లో చెప్పారు. ఘజియాబాద్ పోలీసులు అతని తండ్రినీ, ఇతర కుటుంబ సభ్యుల్ని వేధించారన్నారు. జంతర్ మంతర్లో CJP ఆందోళనకు తొలి రోజు నుంచే జునైద్ ౩ పూటలా ఆహారం అందించారు. జునైద్ లేకపోతే ఈ ప్రొటెస్ట్ సాఫీగా జరిగేది కాదని CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే అనేక సార్లు చెప్పారు.


