కాన్సాస్ వరదల్లో AP యువకుడు మృతి

AP: అమెరికాలోని కాన్సాస్ ప్రాంతంలో సంభవించిన వరదల్లో బాపట్ల జిల్లా పర్చూరు మండలం దేవరపల్లికి చెందిన దొప్పలపూడి వెంకటేశ్(32) గల్లంతయ్యాడు. అతడి డెడ్బాడీ తన కారుకు సమీపంలోనే బురదలో కూరుకుపోయి ఉన్నట్లు అమెరికా పోలీసులు గుర్తించి, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మూడేళ్ల క్రితం ఉన్నత విద్య (MS) కోసం అమెరికా వెళ్లిన వెంకటేశ్, చదువు పూర్తిచేసుకుని అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. చేతికి అందివచ్చిన కుమారుడు ప్రాణాలు కోల్పోవడంతో వెంకటేశ్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.



