రాజ్యాంగం గురించి చెప్పే అరుదైన ఈవెంట్

రాజ్యాంగం అంటే ఏంటి, అది మనకెందుకు ముఖ్యం అని తెలుసుకోవాలనుకునే యూత్ కోసం తిరుపతిలో ఓ స్పెషల్ మీట్ జరగనుంది. జులై 26న (ఆదివారం) రేణిగుంటలోని విష్ణు గ్రాండ్లో ఉదయం 11 నుంచి సాయంత్రం 5:30 వరకు "డిగ్నిఫైడ్ ఇండియా" ఈ ఈవెంట్ నిర్వహిస్తోంది. లాయర్ శ్రీకాంత్ చింతల, డాక్టర్ ఆరోగ్య నాదుడు, రాజు అరుముగం లాంటి స్పీకర్లు రాజ్యాంగం గురించి, ఈవీఎం-ఓటింగ్ గురించి సింపుల్గా వివరిస్తారు. క్వశ్చన్-ఆన్సర్ సెషన్ కూడా ఉంటుంది. తిరుపతి మూవ్మెంట్ 21 నిర్వహిస్తున్న ఈ ఫ్రీ ఈవెంట్కి యూత్ అందరూ రావొచ్చని నిర్వాహకులు చెప్పారు.



