ఫోర్జరీ ఆరోపణలపై తమ్మినేనికి చుక్కెదురు

AP: మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి, కుమారుడు వెంకట శ్రీరామ్ చిరంజీవి నాగులకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నకిలీ, ఫోర్జరీ డాక్యుమెంట్లతో రూ.4 కోట్ల విలువైన ఆస్తిని కుమారుడి పేరుపై రాయించుకున్నారనే కేసులో అరెస్టు నుంచి రక్షణ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని పేర్కొంటూ, అరెస్టు భయం ఉంటే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ, తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.



