ఆక్వా రంగాన్ని కాపాడాలి

AP: పొగాకు, ఆక్వా రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలపై CM చంద్రబాబు కేంద్రానికి లేఖలు రాశారు. రొయ్యల మేత కొరత నివారణకు జన్యుపరంగా మార్పు చేసిన సోయాబీన్ మీల్ దిగుమతికి అనుమతివ్వాలని కేంద్ర మత్స్య శాఖ మంత్రిని కోరారు. ఫిష్ మీల్ ఎగుమతిని నియంత్రించాలని, ఆక్వా రంగాన్ని కాపాడాలని కేంద్ర వాణిజ్య శాఖను విజ్ఞప్తి చేశారు. FCV పొగాకు ఎగుమతులకు ప్రోత్సాహం, ఏరియేటర్లు, ప్రాసెస్ చేయని పొగాకుపై GST తగ్గింపు కోరారు. అలాగే అమరావతిలో జాతీయ మత్య్స అభివృద్ధి బోర్డ్ (NFDB) ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కోసం నెక్కల్లులో 7.89 ఎకరాల భూమి కేటాయించినట్లు తెలిపారు.



