సాగర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం

TG: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆగపల్లి గ్రామశివారులోని నాగార్జునసాగర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై రెండు కార్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ప్రమాద తీవ్రతకు రెండు కార్లు నుజ్జునుజ్జవగా ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా ఇబ్రహీంపట్నం గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.



