← Back to news

రెండు కార్లు ఢీకొని ముగ్గురు స్పాట్ డెడ్

By DK· 27 Jun 2026· కడప జిల్లా
రెండు కార్లు ఢీకొని ముగ్గురు స్పాట్ డెడ్

AP: కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం పాలెంపల్లి వద్ద ఓవర్ స్పీడ్‌తో వచ్చిన రెండు కార్లు ఎదురెదురుగా ఢీ కొనడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘోర ప్రమాదంలో రెండు కార్ల ముందు భాగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ముగ్గురు వ్యక్తులు స్పాట్‌లోనే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు కార్లలో చిక్కుకున్న వారిని బయటకు తీసి 108 వాహనంలో కడప రిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. మృతులు తిరుపతి పట్టణం జీవకోనకు చెందిన హర్షవర్ధన్(27), కిషోర్(28), సుధీర్ కుమార్ రెడ్డి(24)గా పోలీసులు గుర్తించారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 21h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.