రెండు కార్లు ఢీకొని ముగ్గురు స్పాట్ డెడ్

AP: కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం పాలెంపల్లి వద్ద ఓవర్ స్పీడ్తో వచ్చిన రెండు కార్లు ఎదురెదురుగా ఢీ కొనడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘోర ప్రమాదంలో రెండు కార్ల ముందు భాగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ముగ్గురు వ్యక్తులు స్పాట్లోనే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు కార్లలో చిక్కుకున్న వారిని బయటకు తీసి 108 వాహనంలో కడప రిమ్స్ హాస్పిటల్కు తరలించారు. మృతులు తిరుపతి పట్టణం జీవకోనకు చెందిన హర్షవర్ధన్(27), కిషోర్(28), సుధీర్ కుమార్ రెడ్డి(24)గా పోలీసులు గుర్తించారు.



