మానసిక సమస్యలతో తెలంగాణ టెక్కీ సూసైడ్ !

తెలంగాణలోని మేడిపల్లిలో ఒక విషాదకర సంఘటన వెలుగుచూసింది. తీవ్ర మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న తేజస్విని (25) అనే మాజీ సాఫ్ట్వేర్ ఉద్యోగిని, అర్ధరాత్రి బట్టలు లేకుండా వీధుల్లో పరిగెడుతూ స్థానిక బీరప్ప గుడి కోనేట్లోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. బెంగళూరులో ఐటీ ఉద్యోగం వదిలేసిన ఆమె, గత కొంతకాలంగా తీవ్ర భయాందోళనలు, డిప్రెషన్తో బాధపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. సిసిటివి ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



