అంబటి రాంబాబుపై పరువు నష్టం దావా వేస్తా: గళ్లా మాధవి

AP: మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలని టీడీపీ నేత, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి డిమాండ్ చేశారు. ప్రూఫ్స్ చూపకపోతే ఆయనపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. గుంటూరు జిల్లాలో మాధవి పర్యటించిన ఆమె మీడియాతో మాట్లాడుతూ గుంటూరులో మహిళపై జరిగిన ఘటనను రాజకీయాల కోసం వాడుకోవడం దుర్మార్గమన్నారు. ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు.



