నోటిఫికేషన్ మార్చాలంటూ నిరుద్యోగులు మెరుపు ధర్నా

TG: హైదరాబాద్లోని ఇందిరాపార్క్ చౌరస్తాలో నిరుద్యోగులు మెరుపు ధర్నా చేశారు. 7,437 పోస్టులు కాకుండా 19 వేల పోలీస్ జాబ్స్కు కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నోటిఫికేషన్ లేట్ అవ్వడంతో వేలాది మంది ఓవర్ఏజ్ అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ పోస్టులకు మ్యాక్సిమమ్ ఏజ్ 36 ఏళ్లకు, ఎస్సై పోస్టులకు 38 ఏళ్లకు పెంచాలని కోరారు. అప్లికేషన్ ఫీజ్ తగ్గించాలని, డిమాండ్లు నెరవేరేదాకా ప్రొటెస్ట్ ఆగదని వార్నింగ్ ఇచ్చారు.



