భర్త నరాల్లోకి హార్పిక్ ఎక్కించి హత్య

TG: నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం న్యాల్కల్కు చెందిన ప్రశాంత్(35), సంధ్య దంపతులు. ఉపాధి నిమిత్తం దుబాయ్కి వెళ్లిన ప్రశాంత్ గతనెల 27న తిరిగి వచ్చాడు. సంధ్యకు అనిల్తో వివాహేతర సంబంధముంది. భర్తను అడ్డు తొలగించుకోవాలని న్యాల్కల్ వాసి బంటితో సంధ్య ప్లాన్ వేసింది. మద్యం తాగించి భర్తను దాబా పైనుంచి తోసేశారు. కానీ ప్రశాంత్ గాయాలతో బయటపడడంతో హాస్పిటల్లో చికిత్స చేయించారు. భర్త ఎక్కడ కోలుకుంటాడోనని భావించిన సంధ్య, అతని చేతికి ఉన్న సెలైన్ బాటిల్ ద్వారా టాయిలెట్ క్లీనర్(హార్పిక్)ను ఎక్కించింది. ప్రశాంత్ కన్నుమూశాడు. పోలీసులు సంధ్య, బంటి, అనిల్ను అరెస్ట్ చేశారు.



