రేపు వైన్స్ బంద్

TG: బోనాల పండగ సందర్భంగా ప్రజాశాంతి, భద్రత దృష్ట్యా హైదరాబాద్ నగరం మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న వైన్ షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లు మూసేస్తున్నారు. రేపు ఉదయం 10 గంటల నుండి ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు ఈ బంద్ కొనసాగుతుంది. ప్రజలు ఈ ఆదేశాలను గౌరవించి, పోలీసుశాఖకు సహకరించి, బోనాల పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ విజ్ఞప్తి చేసింది.



