బిగ్ అలర్ట్.. SIR సర్వేకు ఇక 3 రోజులే

AP: SIR ఇంటింటి సర్వే ప్రక్రియ మరో మూడు రోజుల్లో ముగుస్తుందని, జూన్ 14వ తేదీ అర్ధరాత్రి నుంచి సర్ మ్యాపింగ్ యాప్ పని చేయడం ఆగిపోతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గడువు పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు డిజిటలైజ్డ్ అయిన ఓటర్లలో సుమారు 10 శాతం మంది ఓటర్లలో మరణించిన వాళ్లు, ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉన్న వారు, దొరకని ఓటర్లు ఉన్నట్లుగా అంచనా వేస్తున్నట్లు తెలిపారు. జూలై 11 సాయంత్రం 4గంటల వరకు మొత్తం 4,16,27,694 మంది ఓటర్లకు గాను 3,61,23,312 ఓటర్ల వివరాలు డిజిటలైజ్డ్ అయ్యాయని పేర్కొన్నారు.



