ఫకీరు వేషంలో వచ్చి నగదు కొట్టేశాడు

AP: నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలంలోని సౌరదిన్నె గ్రామంలో ఫకీరు వేషంలో వచ్చిన ఓ దుండగుడు మహిళను మోసం చేసి నగదును అపహరించాడు. పూజలు చేయాలని చెప్పి బయటకు పంపి ఇంట్లోకి చొరబడ్డ దొంగ రూ.50 వేల నగదును దోచుకెళ్లాడు. బాధితురాలు కాశింభీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



