మద్యంమత్తులో డ్రైవర్ బీభత్సం.. కొడుకు ముందే తల్లి స్పాట్డెడ్

TG: మేడ్చల్ జిల్లా దుండిగల్ PS పరిధిలోని బహుదూర్పల్లి మెయిన్ రోడ్పై మద్యంమత్తులో బొలెరో డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. బైక్పై వెళ్తున్న తల్లీకొడుకును బొలెరో వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి లతారెడ్డి(49) స్పాట్లోనే మృతిచెందగా.. కొడుకు వేదాంత్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వేదాంత్ను చికిత్స నిమిత్తం స్థానిక హాస్పిటల్కు తీసుకెళ్లారు. అలాగే లతారెడ్డి డెడ్బాడీని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



