← Back to news

మద్యంమత్తులో డ్రైవర్ బీభత్సం.. కొడుకు ముందే తల్లి స్పాట్‌డెడ్

By DK· 30 Jun 2026
మద్యంమత్తులో డ్రైవర్ బీభత్సం.. కొడుకు ముందే తల్లి స్పాట్‌డెడ్

TG: మేడ్చల్ జిల్లా దుండిగల్ PS పరిధిలోని బహుదూర్‌పల్లి మెయిన్ రోడ్‌పై మద్యంమత్తులో బొలెరో డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. బైక్‌పై వెళ్తున్న తల్లీకొడుకును బొలెరో వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి లతారెడ్డి(49) స్పాట్‌లోనే మృతిచెందగా.. కొడుకు వేదాంత్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వేదాంత్‌ను చికిత్స నిమిత్తం స్థానిక హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అలాగే లతారెడ్డి డెడ్‌బాడీని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 20h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.