← Back to news

నా కొడుకును పోలీసులే చంపేశారు

By డీకే· 4 Jul 2026· విజయవాడ
నా కొడుకును పోలీసులే చంపేశారు

AP: రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన సాయికృష్ణ కేసులో మెజిస్టీరియల్ విచారణ కొనసాగుతోంది. విజయవాడలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన విచారణకు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, మేనమామ నాగేశ్వరరావు, మేనత్త హాజరై తమ వాంగ్మూలాలను సమర్పించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి సంచలన ఆరోపణలు చేశారు. తన కుమారుడు సాయికృష్ణను పోలీసులే చంపేసి, మృతదేహాన్ని మాయం చేశారని ఆరోపించారు. కృష్ణలంక PSలో సాయికృష్ణ ఉన్నట్లు సమాచారం రాగానే అక్కడికి వెళ్లామని విజయలక్ష్మి తెలిపారు. CI నాగరాజు తన కుమారుడిని చూడనీయకుండా వెనక్కి పంపించారని అన్నారు.

More in AP