దినకర్మ సామాగ్రి తీసుకెళ్తుండగా ఘోర ప్రమాదం

TG: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం వడ్డేపల్లి శివారులోని కంకర క్రషర్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. గోర్గల్ గ్రామానికి చెందిన జుంజురు దినేష్(26), జుంజురు రమేష్(24) దినకర్మ సామాగ్రి తీసుకుని బైక్పై వెళ్తున్నారు. గుర్తుతెలియని వాహనం వేగంగా వచ్చి వీరిని బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో దినేష్ స్పాట్లోనే మృతి చెందగా, తీవ్రంగా గాయపడ్డ రమేష్ను బాన్సువాడ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో అతను మృతి చెందినట్లు SI శివకుమార్ తెలిపారు.



