← Back to news

పెళ్లి తర్వాత బయటపడిన అసలు నిజం

By DeeK· 2 Jul 2026· పల్నాడు జిల్లా
పెళ్లి తర్వాత బయటపడిన అసలు నిజం

AP: పల్నాడు జిల్లా ఈపూరు మండలం కొచ్చర్ల గ్రామానికి చెందిన యువతిని, ఇనిమెళ్ల విలేజ్‌కు చెందిన మల్లవరపు శాంతివర్ధన్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఇప్పటికే మరో మహిళతో సంబంధం ఉన్న విషయాన్ని దాచిపెట్టి మ్యారేజ్ చేసుకున్నాడని ఆరోపణలు రావడంతో పెళ్లికూతురు కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసం చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని పెళ్లికూతురు కుటుంబసభ్యులు, గ్రామస్తులు పెద్దఎత్తున ఈపూరు PS ఎదుట బైఠాయించారు. దీంతో పోలీసులు పెళ్లికొడుకును అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకుంది.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 20h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.