పెళ్లి తర్వాత బయటపడిన అసలు నిజం

AP: పల్నాడు జిల్లా ఈపూరు మండలం కొచ్చర్ల గ్రామానికి చెందిన యువతిని, ఇనిమెళ్ల విలేజ్కు చెందిన మల్లవరపు శాంతివర్ధన్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఇప్పటికే మరో మహిళతో సంబంధం ఉన్న విషయాన్ని దాచిపెట్టి మ్యారేజ్ చేసుకున్నాడని ఆరోపణలు రావడంతో పెళ్లికూతురు కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసం చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని పెళ్లికూతురు కుటుంబసభ్యులు, గ్రామస్తులు పెద్దఎత్తున ఈపూరు PS ఎదుట బైఠాయించారు. దీంతో పోలీసులు పెళ్లికొడుకును అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకుంది.



