ఆటో డ్రైవర్లను ఢీకొట్టిన చెత్త టిప్పర్

TG: రంగారెడ్డి జిల్లాలోని మందమల్లమ్మ చౌరస్తా చంద్రా గార్డెన్స్ వద్ద సంతోష్ (26) అనే ఆటోడ్రైవర్ ఆటో రిపేర్ వచ్చి ఆగిపోయింది. ఆటోను మెకానిక్ షాపునకు తీసుకెళ్లేందుకు తన ఫ్రెండ్స్ ప్రసాద్, సునీల్(33)లకు ఫోన్ చేశాడు. వారు మరో ఆటోలో అక్కడకు వచ్చారు. ఆటోకు తాడుతో కట్టి తరలించేందుకు సునీల్, ప్రసాద్ సిద్ధమయ్యారు. LBనగర్ వైపు నుంచి వచ్చిన GHMC చెత్త టిప్పర్ రోడ్డు పక్కనున్న ఆటోడ్రైవర్లను ఢీకొట్టింది. సంతోష్ స్పాట్లోనే మరణించాడు. గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సునీల్ మృతి చెందాడు.



